Pithapuram YSR CP Pendem Dorababu | Pithapuram Political News | 2019 Elections

పిఠాపురం బీజేపీ మండల అధ్యక్షడు అక్కిరెడ్డి శ్రీనివాసరావు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు పెండెం దొరబాబు సమక్షం లో అక్కిరెడ్డి శ్రీనివాస రావు తో పాటు  విరవ గ్రామము నుంచి వచ్చిన యువకులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పెండెం దొరబాబు మాట్లాడుతూ జగన్ ని సీఎం చేయడానికి అందరం కలిసి పనిచేయాలని , ఆయనతోనే అభివృద్ధి సాధ్యమని, జగన్ ప్రకటించిన నవరత్నాలను ప్రజలలోకి తీస్కుని వెళ్లాలని. జగన్ పిఠాపురం రాబోతున్నారని ఆయన సభను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో నడిగట్ల చింతలరావు , పిడుగు హరికృష్ణ , చల్ల శివశంకర్, పిడుగు రమణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.


Keywords : YSR CP , Pendem Dorababu , Akkireddy Srinu , BJP Pithapuram, 

Comments