అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలూ ఏమిటి? Ammavari Pooja Vidhanam - Vratalu

 

అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలూ ఏమిటి? ఈమాసాలలో అమ్మవారికి ఇలా పూజచేస్తే కష్టాలు తొలగిపోతాయీ..

ప్రతి రోజు సాయంత్రం / ప్రదోష కాలం లో అమ్మవారు , శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు అట. ఈ సమయములో చేసే పూజలు అంటే అమ్మవారికి చాల ఇష్ఠం అట. అవి ఆర్ద్రనతకరి అని , అనంత తృతీయ, రసకల్యని అని వ్రతం చాలా ఇష్టం అని పురాణ వచనం. ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయటం అత్యంత ప్రీతికరం.

ప్రతి మంగళవారం అమ్మవారిని సేవించడం, పూజ చేయటం, అర్చన చేయటం , వ్రతం చేయటం కూడా విశేషం అని అమ్మవారు చెపుతుంది. ఎవరు మంగళవారం అమ్మవారిని పూజ చేస్తారో వారికీ శత్రు పీడలు ఉండవు , రోగ నివారణ , అప్పులు , రుణాలు తీరిపోతాయి అని , కుజ గ్రహ దోషాలు జాతకం లో ఎక్కడ ఉన్న కూడా దోష పరిహారం అవుతుంది అని, అమ్మవారికి అత్యంత ప్రీతికర్మయిన రోజు ఈ భౌమవారం (మంగళవారం) అని చెపుతారు. ఎవర్ని అయితే అమ్మవారు కరుణిస్తుందో వారి ఇంటికి అమ్మవారు కదిలి వస్తుందట. పిలవని పేరంటంగా ఎవరు వస్తారో వారే అమ్మవారి స్వరూపంగా చెపుతారు.

కృష్ణ చతుర్దశి (బహుళ చతుర్దశి ) , ప్రతి మాసం లో అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశి రోజున అమ్మవారిని స్తుతించటం వలన అమ్మవారి కృపకి పాత్రులు కావచ్చు.

నవరాత్రి ద్వయం అంటే శరన్నవరాత్రులు ( దసరా నవరాత్రి ) , వసంత నవరాత్రులు ( ఉగాది నుంచి శ్రీ రామ నవమి వరకు చేసేది).

అమ్మవారికి అత్యంత ప్రీతికరమయిన నవరాత్రులు.

వసంత నవరాత్రులు ఎందుకు అమ్మవారికి ఇష్టం అంటే దేవి భాగవతం లో " శ్రీ రామో లలితాంబికా , శ్రీ కృష్ణో శ్యామలంబ " అంటారు, అంటే శ్రీ రాముడు ఎవరో కాదు లలితా పరమేశ్వరే , స్వరూపం రాముడు, అవతారం లలితాంబ అని చెపుతారు. శ్రీ రాముడికి పూజ చేసిన అమ్మవారికి పూజ చేసినట్టే. అందుకనే శ్రీ రామ నవరాత్రులలో కూడా అమ్మవారికి పూజ చేస్తారు.

అమ్మవారు మనల్ని ఎలా ఏ రూపం లో అనుగ్రహిస్తుంది ?

కాళి, చండి , బాల, లలిత , దుర్గ అనేక రూపాలలో ఉండి మనని నడిపిస్తుంది , కరుణిస్తుంది అని...

ఒకటి అని కాదు అమ్మవారు సకల వ్యాప్తం అయి ఉంది . మాత్రు రూపం , శాంతి రూపం , ఆకలి రూపం లో , జాతి రూపం లో , చైతన్య స్వరూపం , నిద్ర రూపం లో , దయా రూపం లో , బుద్ది రూపం లో కూడా అమ్మవారు ఉంది మనని నడిపిస్తుంది.

అమ్మవారిని ఏమి కోరుకోవాలి?

కొందరు పిల్లలు కావాలి అని , ఇల్లు కట్టుకోవాలి అని , పెళ్లి కావాలని రక రకాల కోరికలు కోరతాం. కానీ ఏది కోరిన మళ్ళీ దాని వలన కలిగే సుఖం అల్పం, క్షణికం . అది తీరగానే మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది.

మరి ఏమి కోరాలి ? 

శంకరాచార్య అంటారు " నన్ను కరుణించు , నాతో ఉండు" మోక్షం వద్దు , విద్య వద్దు , సంపదలు వద్దు , కానీ నీ నామ స్మరణ చాలు , నాతో ఉండాలి. ఎప్పుడూ నీ పాదాల చెంత భక్తీ కలిగి ఉండాలి , ఎప్పుడు కరుణిస్తూ ఉండాలి , నన్ను ధర్మమయిన మార్గం లో నడిపించాలి అని  కోరుకోవాలి అంటారు.

Famous Posts:

Tags : Ammavari navratri poojalu, Ammavari Pooja Vidhanam, అమ్మవారికి, Navratri, durga puja essay, duga mata, durga devi, ammavaru, goddess, pooja vidhanam

Comments